27న విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా | power employees dharna on 27th | Sakshi
Sakshi News home page

27న విద్యుత్‌ ఉద్యోగుల మహా ధర్నా

Aug 24 2018 1:26 AM | Updated on Aug 24 2018 1:26 AM

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఈనెల 27వ తేదీన మహా ధర్నా చేయనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ (టీఎస్‌పీఈ) జేఏసీ గురువారం ప్రకటించింది. 2018 పీఆర్సీ అమలు, ఉద్యోగులు అందరికీ ఉచిత ఆరోగ్య పథకం సహా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement