హరితహారంలో ప్రభుత్వ ఆర్భాటం తప్పా జరుగుతున్నది శూన్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.
'సీఎం నాటిన మొక్కలే ఎండిపోయాయి'
Jul 12 2017 4:06 PM | Updated on Aug 15 2018 9:40 PM
హైదరాబాద్: హరితహారంలో ప్రభుత్వ ఆర్భాటం తప్పా జరుగుతున్నది శూన్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. కరీంనగర్లో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమంలో ప్రజానిర్బంధం కొనసాగింది. 'నగరంలో సామాన్యులు తిరగలేనంత పోలీస్ నిర్బంధం విధించారు. టౌన్ లో దుకాణాలు బంద్ చేయించారు.. హోటల్స్ లో ఎవరికి రూమ్స్ ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. ప్రజలను భాగస్వామ్యం చేయకుండా.. టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటం చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్పా ఒరిగేదిలేదు. స్వయంగా ముఖ్యమంత్రి నాటిన మొక్కలే ఎండిపోయాయి' ఎద్దేవ చేశారు.
Advertisement
Advertisement