తన నియోజకవర్గంలోని నేరేళ్లలో దళితులు, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు తనకు సరైన సమాచారం ఇవ్వలేదని బుకాయిస్తున్న కేటీఆర్.
సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని నేరేళ్లలో దళితులు, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు తనకు సరైన సమాచారం ఇవ్వలేదని బుకాయిస్తున్న కేటీఆర్.. మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ఐదువారాలకు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ ప్రజా సమస్యలపై ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.