వార్తా పత్రికలకు పీసీఐ సూచన 

Pay The Fee For The PCI In Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)కు వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని పీసీఐ సూచించింది. ఆ మొత్తాన్ని  Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్‌ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ లింకు, ఇతర చెల్లింపు వివరాలను  http://presscouncil.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్‌ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్‌ ద్వారా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top