ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్ | no threat to tdp, even if leaders quit, says nara lokesh | Sakshi
Sakshi News home page

ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్

Oct 30 2014 9:46 PM | Updated on Aug 29 2018 3:37 PM

ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్ - Sakshi

ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్

తెలంగాణలో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని టీడీపీ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని టీడీపీ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు.

ఈసారి 25 లక్షల మందితో సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయితే, సభ్యత్వం కోసం వంద రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుందని, సాధారణ సభ్యులకు అది వర్తించబోదని లోకేష్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement