సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు సరికొత్త, వినూత్న చికిత్స అందించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది. హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే యాంటీ రెట్రోవైరల్ మందులను మరికొన్నింటిని కలిపి వాడటం ద్వారా ప్రస్తుతం కరోనాకు అందిస్తున్న చికిత్సను బలోపేతం చేయాలనేది సీఎస్ఐఆర్ ఆలోచన. ఇందుకోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి మూడో దశ ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని సీఎస్ఐఆర్ ప్రభుత్వ సంస్థలకు బుధవారం దరఖాస్తు చేసింది. ‘ముకోవిన్’ అని పిలుస్తున్న ఈ ప్రయోగాలు ఢిల్లీలోని మెడాంటా మెడిసిటీ ఆసుపత్రి భాగస్వామ్యంతో జరగనున్నాయి. 300 మంది రోగులను నాలుగు సమాన గుంపులుగా విడదీసి ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను 17 నుంచి 21 రోజుల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం.
ముమ్మరంగా అధ్యయనం
ఈ కొత్త ప్రయోగాల్లో ఉపయోగించే మందుల వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశముందని, సీఎస్ఐఆర్ సంస్థలతో పాటు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఒక ప్రకటనలో తెలిపారు. శరీరంలో కరోనా వైరస్ పెరగడానికి కారణమయ్యే ప్రొటీన్లు, సైటోకైన్ ఉప్పెనకు దారితీసే అంశాలపై ఈ అధ్యయనం దృష్టి పెడుతుందని లక్సాయ్ లైఫ్సైన్సెస్ సీఈవో రామ్ ఎస్.ఉపాధ్యాయ తెలిపారు. ఫావిపిరవిర్ను కోల్చికైన్తో కలిపి, అలాగే ఉమిఫెనొవిర్ కోల్చికైన్ మిశ్రమం, నఫామోస్టాట్కు 5–అమినోలెవులినిక్ యాసిడ్ను కలిపి అందించడం ఈ అధ్యయనంలో కీలకాంశం. ఫావిపిరవిర్ను జపాన్లో ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేయగా, దాన్ని కరోనాకు ఉపయోగించవచ్చునని ఐఐసీటీ గతంలోనే సూచించింది. మిగిలిన మందులు వైరస్ శరీరంలోకి ప్రవేశించేందుకు ఉన్న మార్గాలు, నకళ్లు సృష్టించుకోవడాన్ని నిరోధించడం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ మందుల మిశ్రమాలు సురక్షితమైనవని, సమర్థంగా పనిచేస్తాయని నిర్ధారించడం ఈ అధ్యయనం ఉద్దేశం. అన్నీ సవ్యంగా సాగితే కరోనా చికిత్సకు మరింత సామర్థ్యం చేకూరుతుందని అంచనా.
కరోనాకు కొత్త చికిత్స
Published Thu, Jul 9 2020 6:36 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement