కేసీఆర్‌కు నచ్చినట్లు చెప్పుకుంటున్నారు: నాగం | nagam janardhan reddy takes on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు నచ్చినట్లు చెప్పుకుంటున్నారు: నాగం

Jun 19 2017 1:14 PM | Updated on Oct 19 2018 6:51 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు నచ్చినట్లు చెప్పుకుంటున్నారనీ బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు నచ్చినట్లు చెప్పుకుంటున్నారనీ బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ముందు నుంచి మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని, అయినా ముస్లిం రిజర్వేషన్లకు ప్రధాని ఒప్పుకున్నారని, ఒక వేళ ఒప్పుకోకపోతే పోరాటం చేస్తామని తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని ముఖ్యమంత్రి నిర్ధారణకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంత ఒత్తిడి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement