కేసుల విచారణకు మొబైల్‌ వాహనం | Mobile vehicle to investigate cases | Sakshi
Sakshi News home page

కేసుల విచారణకు మొబైల్‌ వాహనం

Jun 30 2020 6:07 AM | Updated on Jun 30 2020 6:07 AM

Mobile vehicle to investigate cases - Sakshi

వీసీ ద్వారా మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వ్యాన్‌ను ప్రారంభిస్తున్న హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, వరంగల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జడ్జి పి.నవీన్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో అత్యవసర కేసుల్ని వాదించేందుకు దేశంలోనే తొలిసారిగా వరంగల్‌లో మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాహనాన్ని సోమవారం హైకోర్టు ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలో ఆ జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాలు లేని న్యాయవాదులు తమ కేసుల్ని వాదించేందుకు ఈ మొబైల్‌ వాహనం ఉపయోగపడుతుందని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారని, వరంగల్‌ నగరంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల్ని వాదించేందుకు వీలుపడుతుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement