ఎమ్మెల్యే కారు ఢీకొని ఒకరికి గాయూలు | MLA car to someone stumbling gayulu | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారు ఢీకొని ఒకరికి గాయూలు

Apr 2 2015 2:12 AM | Updated on Aug 14 2018 3:25 PM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పెనుబల్లి: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెనుబల్లి మండల కేంద్రంలోని  వియంబంజర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుంచి పెనుబల్లిలో జరిగే బహిరంగ సభ కు వెళ్తున్న ఎమ్మెల్యే కారు రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన రథం బ్రహ్మచారికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మం తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement