సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో పది గ్రేడ్పాయింట్లు సాధించిన 62 మంది విద్యార్థులతో కలసి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం సహపంక్తి భోజనం చేశారు. పది ఫలితాల్లో జిల్లాను వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే నంబర్వన్గా నిలిపినందుకు కలెక్టర్ శరత్ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కలెక్టర్తోపాటు విద్యాధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే నూరుశాతం ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలో 15వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం 35 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారన్నారు. ‘ఉత్తేజం’కార్యక్రమానికి దాతలు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
టెన్త్ టాపర్లతో మంత్రి సహపంక్తి భోజనం
Published Mon, Jun 3 2019 6:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement