‘బయ్యారం ఉక్కుపై కేంద్రం నాన్చుతోంది’ | Minister KTR visits Bhadradri Kothagudem district | Sakshi
Sakshi News home page

‘బయ్యారం ఉక్కుపై కేంద్రం నాన్చుతోంది’

Apr 3 2018 3:36 PM | Updated on Apr 7 2019 4:32 PM

Minister KTR visits Bhadradri Kothagudem district - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్‌సెంటర్, ఆరోగ్య లక్ష్మీ కేంద్రాలను మంగళవారం కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్నామన్నారు. ఇనుము లేని విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిన ప్రభుత్వం, బయ్యారంలో ఎందుకు పెట్టడంలేదని నిలదీస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు.

కేంద్రం ముందుకు రాకపోయినా సింగరేణి, టీఎస్‌ఎండీసీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement