ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం | meeting of telangana cabinet ends | Sakshi
Sakshi News home page

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

Dec 16 2014 2:15 PM | Updated on Sep 4 2018 4:52 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.మంగళవారం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అనంతరం కేబినెట్ సమావేశమైంది.

హైదరాబాద్:తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళవారం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అనంతరం పూర్తిస్థాయి కేబినెట్ సమావేశమైంది. తాజా తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం గవర్నర్ నరసింహన్  ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో వీరితో  ప్రమాణ స్వీకారం చేయించారు. 

 

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), అల్లోల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (హైదరాబాద్ ),  సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్), అజ్మీరా చందూలాల్ (వరంగల్ ), జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) ఉన్నారు.  తెలంగాణలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement