రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు | Maheshwaram MLA Sabita Indra Reddy Remembers YSR On Rakhi Festival | Sakshi
Sakshi News home page

రాఖీ పండుగ వచ్చిందంటే.. రాజన్నే గుర్తొస్తడు

Aug 15 2019 11:54 AM | Updated on Aug 15 2019 11:54 AM

Maheshwaram MLA Sabita Indra Reddy Remembers YSR On Rakhi Festival - Sakshi

సాక్షి, మహేశ్వరం: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చాటేది రాఖీ పండుగ. అన్ని పండుగలకంటే రాఖీ నాకు ఎంతో ఇష్టం. దివంగత నేత, అన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు  ప్రతి రాఖీ పండుగకు ఇంటికి వెళ్లి మొదటి రాఖీ నేనే కట్టేదానిని. నాకు ఒక తమ్ముడు నర్సింహారెడ్డి ఉన్నాడు. రాజశేఖరరెడ్డి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాతే మా తమ్ముడికి కట్టేదానిని. రాజన్న కూడా నన్ను సొంత చెల్లెలుగా చూసుకునేవారు. రాఖీ పండుగ వచ్చిందంటే రాజశేఖరరెడ్డి అన్నే గుర్తొస్తడు. నేను చదువుకునే రోజుల్లో రాఖీ పండుగ రోజున మా తమ్ముడికి రాఖీని పోస్టులో పంపించేదాన్ని. ఇప్పుడు రాఖీ పండుగ రోజున మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement