చేవెళ్ల రూరల్: గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మద్యం సీసాలు పడేసి వెళ్లారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చేవెళ్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. చేవెళ్ల మండలం తోలుకట్ట బస్స్టేజీ నుంచి కేసారం బస్ స్టేజీ వరకు దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు ఓ డీసీఎం వాహనంలోంచి రోడ్డుపక్కన మద్యం బాటిళ్ల కాటన్లు (ఆఫీసర్ చాయిస్ క్వార్టర్ సీసాలు) విసిరేసి వెళ్లారు. సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు గమనించి మద్యం సీసాలను తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ దశరథ్ తదితరులు వచ్చి ఏడు బృందాలుగా విడిపోయారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల, మల్కాపూర్, కందవాడ, పలుగుట్ట, కేసారం, తోలుకట్టతోపాటు ముడిమ్యాల అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 500 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సదరు మద్యం సుంకం చెల్లించనిది అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలోని కొయ్యూర్, పెద్దపూర్, కౌలంపేట తదిర ప్రాంతాల్లో సుంకం చెల్లించని మద్యం విషయమై దాడులు చేస్తున్నామని, దీనికి సంబంధించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిలో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారేఇలా మద్యాన్ని అధికారులకు లభించకుండా రోడ్డుపై పడేసి ఉండొచ్చన్నారు. సదరు మద్యం ఈ ప్రాంతానికి చెందినది కాదన్నారు. ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పడేసి వెళ్లారు? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం బాటిళ్లు తీసుకుపోయిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తిరిగి ఇవ్వాలన్నారు. కల్తీ మద్యం అయి కూడా ఉండొచ్చు, కాబట్టి ప్రజలు గ్రామ పంచాయతీల్లో అప్పగించినా తమ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని అధికారులు సూచించారు.
మద్యం సీసాల కలకలం
Published Sun, Jan 18 2015 1:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement