రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే | kcr aerial survey at Rachakonda | Sakshi
Sakshi News home page

రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే

Dec 3 2014 3:44 PM | Updated on Aug 14 2018 10:51 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అంతకుముందు ముచ్చర్ల అటవీ భూములను పరిశీలించారు. ఔషధ పరిశ్రమల కోసం భూములను అన్వేషిస్తున్నారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ వెంట పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో కలసి రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేకు వెళ్లారు.

 

Advertisement
 
Advertisement
Advertisement