ఆదిలాబాద్ టౌన్, న్యూస్లైన్ : కేసీఆర్ మంత్రి వర్గంలో జిల్లాకు చోటు దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 మంది ఎమ్మెల్యేలకు స్థానం దక్కగా, అందులో జిల్లా నుంచి జోగు రామన్నకు అవకాశాలు రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. దీంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా నియామకం కావడంతో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ప్రాధాన్యత లభించినట్లయింది. ఆదిలాబాద్ పట్టణంతోపాటు మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లో కాలుష్యం పెరిగింది. దీని నివారణకు పర్యావరణ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అడవుల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కార్యకర్త స్థాయి నుంచి..
కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థాయి వరకు అనేక రాజకీయ పదవులు అనుభవించారు. 1984 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 1985 నుంచి 1986 వరకు జైనథ్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 1987-88 వరకు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 1988 నుంచి 1995 వరకు దీపాయిగూడ సర్పంచ్, జైనథ్ మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్షునిగా, 2005-06, 2009-11 వరకు జైనథ్ మండల జెడ్పీటీసీగా పనిచేశారు. 2004 సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి పోటీ చేసి 2009 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011 సంవత్సరంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2012 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రసుత్తం మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు.
జిల్లాకు మంత్రి పదవి
Published Tue, Jun 3 2014 1:15 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కాంగ్రెస్ గూటికి సెల్లూరు రాజా?
విద్యుత్ షాక్తో వృద్ధుడి మృతి
పల్లావరంలో ఉత్కంఠ
రూ.1.36 కోట్లు మోసం
వైభవంగా తిరుకామీశ్వరర్ రథోత్సవం
శిశువుల అపహరణ కట్టడికి కొత్త ప్రయోగం
కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 14 టేబుల్స్ ఏర్పాటు
ప్రయాణికులను మధ్యలో దింపేశారు!
సిబ్బంది నిర్లక్ష్యం.. గర్భిణులకు ఇక్కట్లు
తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement