బుల్లెట్‌పై వెళ్లి పత్తి ఏరిన కలెక్టర్‌.. | Jayashankar Bhupalpally Collector Visit Cotton Crops | Sakshi
Sakshi News home page

కూలీలతో కలసి పత్తి ఏరిన కలెక్టర్‌

Jan 13 2020 11:58 AM | Updated on Jan 13 2020 11:58 AM

Jayashankar Bhupalpally Collector Visit Cotton Crops - Sakshi

భూపాలపల్లి రూరల్‌ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్‌ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్‌ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు.  వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement