ఐటీఐ అభ్యర్థులకు నేడు జాబ్‌మేళా | Sakshi
Sakshi News home page

ఐటీఐ అభ్యర్థులకు నేడు జాబ్‌మేళా

Published Tue, May 26 2015 12:03 AM

ITI candidates To Today job mela

సంగారెడ్డి క్రైం: తోషిబా కంపెనీలో ఐటీఐ ట్రేడ్ ఉద్యోగాల భర్తీ కోసం మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కె.రజని ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ట్రేడ్‌లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, గ్య్రాండర్, స్ప్రే పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం 11 గంటలకు పాత డిఆర్‌ఎడి ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అర్హత సర్టిఫికెట్లతో పాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకొని రావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,041 జీతం ఉంటుందన్నారు.

Advertisement
Advertisement