వరంగల్ జిల్లా జనగాం-ఆలేరు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ : వరంగల్ జిల్లా జనగాం-ఆలేరు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు వికారుద్దీన్, అంజాద్, అనీఫ్, జకిర్, ఇజార్ఖాన్ హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్కౌంటర్ను వికారుద్దీన్ తండ్రి మహ్మద్ హైమద్ ఖండించారు. కేసు విచారణ ముగిసే సమయానికి పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళతామని చెప్పారు.