మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు! | inmates get permitted to watch Cricket match at Charllapalli jail | Sakshi
Sakshi News home page

మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!

Mar 6 2015 6:30 PM | Updated on Sep 2 2017 10:24 PM

చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు వెస్టిండీస్, భారత్‌ల మ్యాచ్ చూసేందుకు అనుమతినిచ్చారు.

హైదరాబాద్ క్రైం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య పోటాపోటీగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ని ఇళ్లలో కూర్చున్న జనమే కాదు.. జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా చూస్తున్నారు. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు వెస్టిండీస్, భారత్‌ల మ్యాచ్ చూసేందుకు అనుమతినిచ్చారు.

ఈ మ్యాచ్‌ను రెండు జైళ్లలోని ఖైదీలను చూపిస్తున్నట్లు జైళ్ల డీజీ వీకే.సింగ్ తెలిపారు. ఇందు కోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్‌గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ఖైదీలు చట్టప్రకారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యే మ్యాచ్‌ను చూస్తారని సింగ్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement