తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, మెదక్లలో ఆదివారం రాత్రి కురిసింది.
హైదరాబాద్ సిటీ: తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, మెదక్లలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి నిజామాబాద్ జిల్లా బోధన్లో సన్ప్లవర్ పంటదెబ్బతింది. ఈ సీజన్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో చాలామంది మెట్ట పంటలు వేశారు.
అయితే ఈ అకాలవర్షానికి తోడు చిన్నపాటి గాలులు వీయడంతో కొన్ని చోట్ల పంటదెబ్బతింది. పశువుల మేత కోసం అల్లాడుతున్న రైతులకు ఈ వర్షం ఊరట కలిగించే విషయమే. హైదరాబాద్లో పలుచోట్ల అకాలవర్షానికి తారురోడ్డుపై కంకర తేలింది.