
శంషాబాద్లో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఆరంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైర్లు దగ్ధమై పొగలు రావడంతో యజమాని, సెక్యూరిటీ గార్డు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మొదటి అంతస్తులోని లాడ్జి రిసెప్షన్ గది కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉన్న మందులతో పాటు ఇతర సామగ్రి, రికార్డులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటల సెగలు పైకి ఎగబాకుతుండడంతో లాడ్జి గదు ల్లో ఉన్న సుమారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలుగు ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో వారంతా బయటకు వెళ్లారు.