పండుటాకుల పరేషాన్‌..! | Head ache of old people | Sakshi
Sakshi News home page

పండుటాకుల పరేషాన్‌..!

Dec 29 2016 4:29 AM | Updated on Sep 4 2017 11:49 PM

పండుటాకుల పరేషాన్‌..!

పండుటాకుల పరేషాన్‌..!

మిర్యాలగూడలో పింఛన్ల కోసం క్యూలైన్‌లో ఉన్న వృద్ధుల మధ్య తోపులాట జరిగింది.

మిర్యాలగూడలో తోపులాట.. 12 మంది ఆసరా లబ్ధిదారులకు గాయాలు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు పోస్టాఫీసు వద్ద బుధవారం ఆసరా పింఛన్లకు క్యూలైన్‌లో నిలబడిన వృద్ధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు  400 మందికి పైగా వృద్ధులు  క్యూలో నిల్చున్నారు.

కాగా, ఈ క్యూలైన్‌లో తోపులాట చోటుచేసుకుని కిందపడ్డారు.దీంతో నాగమ్మ, కాశమ్మ, పద్మ, లింగమ్మ, నర్సమ్మ, సజ్జల అచ్చమ్మ, శ్రీదేవి, రంగమ్మ, ఫాతిమ, జానమ్మ, సరోజ, రాములమ్మ అనే 12 మంది వృద్ధులకు గాయాలయ్యాయి. కాగా, ఈ తోపులాట విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ కిషన్‌రావు పోస్టాఫీసును సందర్శించి క్యూలో నిలబడిన వారితో మాట్లాడారు. క్యూలో నిలబడిన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేయాలని పోస్టల్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement