రాష్ట్రంలో ఒక్క కుటంబంలోనే అభివృద్ధి | ghulam nabi azad indirectly criticises kcr family | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఒక్క కుటంబంలోనే అభివృద్ధి

Dec 9 2016 7:48 PM | Updated on Aug 16 2018 1:18 PM

రాష్ట్రంలో ఒక్క కుటంబంలోనే అభివృద్ధి - Sakshi

రాష్ట్రంలో ఒక్క కుటంబంలోనే అభివృద్ధి

తెలంగాణలో కేవలం ఒక్క కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేవలం ఒక్క కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు.

రాష్ట్ర ప్రజల డిమాండ్ అర్థం చేసుకుని కాంగ్రెస్ అధిస్టానం తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోవడం దురదృష్టకరమని ఆజాద్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement