ఇక నగరంలో ఉచిత వైఫై | Free wifi facility now in hyderabad | Sakshi
Sakshi News home page

ఇక నగరంలో ఉచిత వైఫై

Apr 16 2015 11:37 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపోందించే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైఫై సేవలను అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

హైదరాబాద్: రెండు మూడు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాతావారణం చల్లబడింది. దీంతో అహ్లాదంగా గడపుదామనుకున్న వారితో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. దీనికి తోడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి జనాలు కిటికిటలాడటానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వివారాల్లోకె ళ్లాల్సిందే.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపోందించే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైఫై సేవలను అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

దీనిలో భాగంగా ప్రముఖ మొబైల్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి అరగంట ఫ్రీ వైఫై కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా ఉన్న మన నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఇచ్చిన అరగంట వైఫై ఫ్రీ ఆఫర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో యువత అక్కడికి చేరుకోవడంతో రహదారులన్ని జనసంద్రాలుగా మారాయి. యువతతో పాటు నగర వాసుల్లో అధిక శాతం మంది ఇక్కడే ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement