అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది.
చిగురుమామిడి (కరీంనగర్) : అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట గ్రామానికి చెందిన సాగరిక(24) అనే
వివాహిత ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పండిస్తోంది.
ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగ్గా లేక అప్పులే మిగులుతున్నాయి. ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్న సాగరికకు ఎండిపోయిన పత్తి చేను కనిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సాగరికకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.