మహిళా రైతు ఆత్మహత్య | Female farmer commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Sep 21 2015 3:54 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది.

చిగురుమామిడి (కరీంనగర్) : అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట గ్రామానికి చెందిన సాగరిక(24) అనే
 వివాహిత ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పండిస్తోంది.

ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగ్గా లేక అప్పులే మిగులుతున్నాయి. ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్న సాగరికకు ఎండిపోయిన పత్తి చేను కనిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సాగరికకు భర్త,  ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement