మెదక్జోన్: పొలాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటుతో భూములు కోల్పోయిన తమకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ మెదక్లో రైతులు చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘రోడ్డున పడ్డాం.. పరిహారం ఇప్పించి ఆదుకోవాలంటూ’ బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకోబోగా పలువురు అడ్డుకున్నారు.
కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ వినతిపత్రాలు దహనం చేశారు. చిన్నశంకరంపేట, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట, చిలిపిచెడ్ మండలాల నుంచి 400 కేవీ, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను లాగారు. రైతుల పొలాల్లో టవర్లను ఏర్పాటు చేశారు. సదరు కాంట్రాక్టరు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు కలెక్టరేట్ ఎదుట 4 గంటల పాటు బైఠాయించారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన పాపన్నపేట మండలం కొడుపాకకు చెందిన రైతు మంగలి వెంకటేశం కలెక్టరెట్లోని ఓ చెట్టుకు ఉరి
వేసుకోవడానికి యత్నించాడు.
పరిహారం కోసం ఆందోళన
Oct 31 2017 2:06 AM | Updated on Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement