రుణమాఫీ కోసం రైతుల ఆందోళన | farmers protesting at bank in khammam district | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కోసం రైతుల ఆందోళన

Oct 14 2015 1:45 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్ బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు. రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, పంటల సాగు కోసం తక్షణం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే తాము పని చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇస్తే మాఫీ చేయడానికి తమకు అభ్యంతరం ఏమీలేదని బ్యాంకు అధికారులు రైతులకు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement