కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తకొండ గ్రామానికి చెందిన జుర్రు లింగయ్య (40) పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కార్యాలయం సిబ్బంది అతడిని హుటాహుటిన ములకనూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తన వాటా భూమిని సోదరుడు సంపత్ ఆయన పేరిట పట్టా చేయించుకున్నాడని... అది తన పేరిట మార్చాలని లింగయ్య కొద్దికాలంగా.. రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విషయమై మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.