రైతు ఆత్మహత్యాయత్నం | farmer to commit suicide at the Tahasildar office | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యాయత్నం

Feb 15 2016 2:59 PM | Updated on Oct 1 2018 2:36 PM

కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తకొండ గ్రామానికి చెందిన జుర్రు లింగయ్య (40) పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కార్యాలయం సిబ్బంది అతడిని హుటాహుటిన ములకనూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తన వాటా భూమిని సోదరుడు సంపత్ ఆయన పేరిట పట్టా చేయించుకున్నాడని... అది తన పేరిట మార్చాలని లింగయ్య కొద్దికాలంగా.. రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే విషయమై మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement