మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత | Ex minister Bochu Sammaiah is no more | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత

Aug 22 2017 2:08 AM | Updated on Mar 18 2019 9:02 PM

మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత - Sakshi

మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు.

పరకాల: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కాలు జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఈ నెల 9న ఆయన్ను నిమ్స్‌కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడంతో నిమ్స్‌లో వైద్య నిపుణుల బృందం చికిత్స అందించింది.

వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య.. 1979లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యునిగా సేవలందించారు. మంగళవారం పరకాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement