గంజాయి సేవిస్తున్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో ఇంజనీరింగ్ విద్యార్థులు
Jul 30 2017 8:23 PM | Updated on Aug 21 2018 6:00 PM
సూర్యాపేట: గంజాయి సేవిస్తున్న 9 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెడతామన్నారు. వారికి గంజాయి సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement