కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు | Electricity Employees Meets To Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు

May 26 2014 12:31 AM | Updated on Sep 5 2018 3:38 PM

కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు - Sakshi

కేసీఆర్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిశారు.

కలెక్టరేట్,న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో  కలిశారు. తెలంగాణ పునర్నిర్మాణంలోను, విద్యుత్ సమస్యలను అధిగమించడంలోనూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా ప్రధాన కార్యాదర్శి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల విభజన నేపథ్యంలో అప్రమత్తంగా వుండి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో యూనియన్ నేతలు గోవింద్‌రావు, ఈశ్వరప్ప,లింగం, శ్రీనివాస్‌రావు, భగీరత్, శ్రీధర్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement