యాదాద్రిలో భక్తుల రద్దీ | crowd of devotees in yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల రద్దీ

Published Mon, Jun 11 2018 1:54 AM | Last Updated on Mon, Jun 11 2018 1:54 AM

crowd of devotees in yadagirigutta - Sakshi

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు, గర్భాలయం, కొండపై పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి భారీ వాహనాలను అనుమతించలేదు. సుమారు 40 వేల మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.

దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండపై పనులు జరిగే ప్రాంతాల నుంచి విష్ణు పుష్కరిణిలోకి పెద్ద ఎత్తున మట్టి కొట్టుకు వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement