వచ్చే విద్యాసంవత్సరం నుంచే.. కేసీఆర్‌ ప్రకటన! | CM KCR Anouncement on Telugu language | Sakshi
Sakshi News home page

Mar 20 2018 6:28 PM | Updated on Aug 15 2018 9:04 PM

CM KCR Anouncement on Telugu language - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్ట్‌ బోధన తప్పనిసరి కానుంది. స్వయంగా తెలుగు భాషాభిమాని అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాతృభాషను బతికించుకునేందుకు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకోసం చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా తెలుగు సిలబస్‌ రూపొందించాలని తెలుగు వర్సిటీని, సాహిత్య అకాడమీలను సీఎం కేసీఆర్‌ కోరారు. సిలబస్‌లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement