కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు! | chain robbery in toddy depot | Sakshi
Sakshi News home page

కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు!

Jun 25 2016 9:59 AM | Updated on Mar 28 2018 11:26 AM

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది.

రాజేంద్రనగర్: కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన ఇద్దరు మహిళలు ఆమెకు పూటుగా కల్లుతాగించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

శనివారం ఉదయం మత్తు నుంచి తేరుకున్న సదరు మహిళ పుస్తెలుతాడు మెడలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement