హైదరాబాద్: ఇటీవల మెదక్జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సులను రవాణా శాఖ తనిఖీలు చేపట్టింది. కానీ ఆటోమొబైల్ రంగంపై అవగాహనలేని అధికారులు దర్జాగా వాటి ఫిట్నెస్ను తనిఖీ చేసేశారు. వారు నిజంగా అధికారులే.. గతంలో రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేసి ఆ తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఏఎంవీఐ)గా పదోన్నతి పొందినవారు. వాహనాల ఫిట్నెస్ను సరిగ్గా అంచనా వేసే పరిజ్ఞానం లేకుండానే విధులు నిర్వహించేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఉదంతానికి నాలుగేళ్ల క్రితం బీజాలు పడ్డాయి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే ఇదే తరహాలో మరికొందరు అడ్డగోలు పదోన్నతులు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.
అంతా ‘రాజస్థాన్’ సర్టిఫికెట్ల మాయ
ప్రమోషన్లు పొందాలంటే పూర్తి అర్హతలుండాలి.. అర్హతలు కావాలంటే గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి అధికారికంగా సర్టిఫికెట్లు పొందాలి.. అది సాధ్యం కాదంటే దొడ్డిదారిలో తిమ్మినిబమ్మి చేయాలి. ఇప్పుడు రవాణాశాఖలో అదే జరుగుతోంది. ఈ శాఖలో ఏఎంవీఐల బాధ్యత కీలకమైంది. వాహనాల ఫిట్నెస్ వ్యవహారాన్ని వీరు పర్యవేక్షిస్తుంటారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ (ఉమ్మడి రాష్ట్రంలో) నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే రవాణాశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతుల ద్వారా కూడా వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ ఆధారంగా 2009లో నాటి ప్రభుత్వం అందుకు 20 శాతం (10 శాతం కానిస్టేబుళ్లకు, 10 శాతం జూనియర్ అసిస్టెంట్లకు)కోటాను కేటాయించింది. ఇక్కడే భారీ ఎత్తున మతలబు జరుగుతోంది. పదోన్నతి పొందే కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు కచ్చితంగా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆటోమొటైల్ డిప్లొమా కోర్సు చేసుండాలి. దీంతో చాలామంది దొడ్డిదారి మార్గానికి తెరదీశారు. రాజాస్థాన్లోని ఓ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లను సంపాదించి వాటి ఆధారంగా పదోన్నతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లకు ఆ ‘అర్హత’ లేదంటూ గతంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏపీపీఎస్సీ, ఇగ్నో, రాష్ట్ర సాంకేతిక విద్యామండలిలు తేల్చిచెప్పాయి. దీంతో భారీ ‘లాబీయింగ్’తో 2010లో ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కూడా చెల్లుతుందంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వు జారీ అయ్యేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని విమర్శలు వినిపించాయి.
హడావుడి పదోన్నతులకు రంగం సిద్ధం: తెలంగాణ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తున్న నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ల బాగోతాన్ని కూడా పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే మరికొందరికి అడ్డగోలు పదోన్నతులు కల్పించి అందినంత దండుకునేందుకు రవాణాశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంగడి సర్టిఫికెట్లతో అడ్డగోలు పదోన్నతులు!
Published Mon, Aug 4 2014 1:52 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement