
వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ
రాష్ట్రంలో కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరి గినందుకు వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
- తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితులు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరి గినందుకు వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండ రెడ్డితో కలసి గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోపాటు వడగండ్ల వానతో వరి, మొక్కజొన్న, పండ్లతోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నా విపత్తుల నిర్వహణ కమిటీతో సీఎం కేసీఆర్ ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నిం చారు. 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు పరిహారం ఇవ్వడంలేదన్నారు. సుధాకర్రెడ్డి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి కోసం రూ.500 కోట్లను విడుదల చేయాలని కోరారు. పంట బీమాపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు.