అంబేడ్కర్‌కు అసెంబ్లీలో నివాళులు  | Ambedkar Jayanti Celebrations In Assembly | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌కు అసెంబ్లీలో నివాళులు 

Apr 15 2019 4:03 AM | Updated on Jun 4 2019 6:28 PM

Ambedkar Jayanti Celebrations In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement