హత్య కేసులో ఆరుగురికి రిమాండ్ | 6 remand in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఆరుగురికి రిమాండ్

Aug 11 2015 2:22 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఖాజీపేట: ఓ హత్య కేసులో ఆరుగురు నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఖాజీపేట మండలం కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు నిందితులను ప్రవేశపెట్టారు. మండలంలో ఈ నెల 2న సాంబయ్య అనే క్వారీ యజమానితో పాటు, గణపతి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులైన శివరాత్రి ప్రసాద్, శివరాత్రి నారాయణ, శివరాత్రి కృష్ణ, శివరాత్రి శంకర్, కస్తూరి రవీందర్, కల్లూరి సుధాకర్‌లను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement