Sakshi News home page

విషాహారం: 50మంది విద్యార్థులకు అస్వస్థత

Published Mon, Sep 28 2015 4:04 PM

50 students suffer food poisoning

చండూరు (నల్లగొండ) : మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగింది. పాఠశాలలో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనాన్ని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుంటుండటంతో అధ్యాపకులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement