
5 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
గంజాయిని తూర్పుగోదావరి నుంచి నగరానికి తరలిస్తుండగా పోలీసులు మార్గమధ్యలో స్వాధీనం చేసుకున్నారు.
హయత్నగర్(రంగారెడ్డి): గంజాయిని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు మార్గమధ్యలో స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రూ. 20 లక్షల విలువ చేసే 5 క్వింటాళ్ల గంజాయిని తరలిస్తుండగా హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి ఒక డీసీఎమ్ వ్యాన్, స్విఫ్ట్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న 5 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.