దొంగ నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం | 17 bikes thief arrested | Sakshi
Sakshi News home page

దొంగ నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Jun 6 2015 6:54 PM | Updated on Sep 4 2018 5:16 PM

వ్యాపారం కలసిరాక ఓ వ్యక్తి దొంగగా మారి 17 ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా కొట్టేశాడు.

బోడుప్పల్ (హైదరాబాద్) : వ్యాపారం కలసిరాక ఓ వ్యక్తి దొంగగా మారి 17 ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా కొట్టేశాడు. చివరికి పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. ఈ కరడుగట్టిన దొంగను శనివారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన అఫ్రోజ్ (39) పాత టైర్ల వ్యాపారం చేసేవాడు. కొంత కాలంగా హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని భవానీనగర్ తలాబ్‌కట్టలో ఉంటున్నాడు. కాగా తను చేసే వ్యాపారంలో తగినంత ఆదాయం రాకపోవడంతో ద్విచక్ర వాహనాలను దొంగిలించడం ప్రారంభించాడు. ఇలా రూ.8లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. అయితే మేడిపల్లి పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో అతడు దొరికిపోయాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement