నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ | tdp MP Rayapati Sambasiva Rao comments on demonetisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ

Dec 10 2016 12:57 PM | Updated on Aug 21 2018 9:33 PM

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ - Sakshi

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ

పెద్ద నోట్లను రద్దు చేసి మోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి అన్నారు

విజయవాడ: పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ బురద కడిగేందుకు చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ బురద మాకు అంటుతోందని రాయపాటి వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు.

నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాయపాటి.. ఈ సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనమంతా కాంగ్రెస్‌ వాళ్ల దగ్గరే ఉందని.. దాన్ని మార్చుకోలేకే వారు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని రాయపాటి విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement