‘పోడు’ జోలికి వస్తే ఊరుకోం: తమ్మినేని | Tammineni comments on Government | Sakshi
Sakshi News home page

‘పోడు’ జోలికి వస్తే ఊరుకోం: తమ్మినేని

Feb 13 2017 1:00 AM | Updated on Jul 11 2019 9:04 PM

‘పోడు’ జోలికి వస్తే ఊరుకోం: తమ్మినేని - Sakshi

‘పోడు’ జోలికి వస్తే ఊరుకోం: తమ్మినేని

పోడు భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, అడ వి నుంచి గిరిజనులను వేరు చేసే హక్కు ఎవరికీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

రఘునాథపాలెం: పోడు భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, అడ వి నుంచి గిరిజనులను వేరు చేసే హక్కు ఎవరికీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యం లో తమ్మినేని నేతృత్వంలో చేపట్టిన మహా జన పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కొనసాగింది. తమ్మినేని మాట్లాడారు.

పోడు భూములను ప్రభుత్వం లాక్కు నేందుకు ప్రయత్నిస్తే ధైర్యంగా పోరాడాలని, తాము గిరిజనులకు అండగా ఉంటామని చెప్పారు. రోడ్లు వేసి, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు కట్ట డమే అభివృద్ధి కాదని, రాష్ట్రంలోని 93 శాతం మంది అట్టడుగు వర్గాల జీవి తాలు బాగుపడితేనే అభివృద్ధి జరిగినట్లని అన్నారు. సీఎం తప్పుడు సలహాల ద్వారా రైతులు నష్టపోయారని తమ్మినేని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement