ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం | shamshabad airport staff stole gold from passenger | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం

Sep 3 2016 4:32 PM | Updated on Sep 4 2017 12:09 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు.

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. పార్లమెంట్‌లో పని చేసే ఓ ఉద్యోగిని శనివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సెక్యూరిటీ తనిఖీల పేరుతో ఆమె బ్యాగులోని 12 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును కాజేశారు. అది గుర్తించిన బాధిత మహిళ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement