రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం | Rs.45 crore in old currency notes seized in Tamilnadu | Sakshi
Sakshi News home page

రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం

May 18 2017 10:48 AM | Updated on Sep 5 2017 11:27 AM

రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం

రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం

రద్దు అయిన పాత నోట్లను భారీ మొత్తంలో తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై: రద్దు అయిన పాత నోట్లను  భారీ మొత్తంలో  తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 45 కోట్ల  పాత క‌రెన్సీని పోలీసులు గురువారం ఉదయం ప‌ట్టుకున్నారు. చెన్నైలోని కోడంబ‌క్కంలో ఉన్న వ‌స్త్ర దుకాణం రామలింగం అండ్‌ కో లో ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దుకాణంలో విస్తృత స్థాయిలో సోదాలు నిర‍్వహిస్తున్నారు.

 ఆ షాపు యజమాని దండపాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జ్యూవెలరీ వ్యాపారికి సంబంధించిన సొమ్ము త‌న ద‌గ‍్గర ఉన‍్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే కానీ పోలీసులు మాత్రం పాత క‌రెన్సీపై ఆరా తీస్తున్నారు. అవినీతి, లంచాల వ‌ల్ల వ‌చ్చిన సొమ్ము అయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement