రూ. 20 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత | rs.20 laksh worth redsander caught in kurnool district | Sakshi
Sakshi News home page

రూ. 20 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత

Oct 31 2016 11:48 AM | Updated on Sep 4 2017 6:48 PM

కర్నూలు జిల్లా రుద్రవరంలో పోలీసులు, అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.

రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరంలో పోలీసులు, అటవీ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. మండలంలోని పెద్దకంబలూరు, శ్రీరంగాపురం, నర్సాపురం గ్రామాలకు చెందిన 13 మంది సమీపంలోని అడవి నుంచి ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం వెయ్యి టన్నుల బరువున్న45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుండగుల ప్రధాన సూత్రధారిగా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అని పోలీసులు చెప్పారు. పట్టుబడిన దుంగల విలవు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement