Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Published Mon, Aug 29 2016 8:43 AM

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. 
 
దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని తెలిపింది. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్నాయి. 

Advertisement

What’s your opinion

Advertisement