మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించిన పైపులను దుండగులు అపహరించుకుపోయారు.
రూ.14 లక్షల విలువైన భగీరథ పైపులు చోరీ
Feb 15 2017 12:13 PM | Updated on Sep 5 2017 3:48 AM
	హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించిన పైపులను దుండగులు అపహరించుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. దొంగలించిన పైపుల విలువ రూ.13,90,569 లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నీటిపారుదల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
