వరంగల్లో రూ.2.65 లక్షలు స్వాధీనం | huge cash surrendered in warangal railway station | Sakshi
Sakshi News home page

వరంగల్లో రూ.2.65 లక్షలు స్వాధీనం

Nov 19 2016 5:27 PM | Updated on Sep 22 2018 7:57 PM

వరంగల్లో రూ.2.65 లక్షలు స్వాధీనం - Sakshi

వరంగల్లో రూ.2.65 లక్షలు స్వాధీనం

వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై శనివారం ఉదయం జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అతన్ని వరంగల్ జిల్లా ములుకలగూడెంకు చెందిన బ్రహ్మదేవ రాజుగా గుర్తించారు. స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్న అతని వద్ద రూ.2,65,000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్తున్నాడని, దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించామని వరంగల్ రైల్వే సీఐ స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement